*🔊JEE: రెండు విడతలుగా జేఈఈ మెయిన్స్ పరీక్ష..షెడ్యూల్ విడుదల*

*🍥దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. రెండు సార్లు జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఎన్డీఏ వెల్లడించింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి విడత, మే 24 నుంచి 29 వరకు రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్ష జరగనుంది. ఇవాల్టి నుంచి ఈనెల 31 వరకు మొదటి విడత జేఈఈ మెయిన్ పరీక్ష దరఖాస్తు స్వీకరిస్తున్నట్టు ఎన్డీఏ తెలిపింది. జులై 3న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. జులై 18న ఫలితాలు వెలువడనున్నాయి. జులై 21న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు నిర్వహించనున్న విషయం తెలిసిందే.*